రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యంగా పోరాటం | fight for revenue division | Sakshi
Sakshi News home page

రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యంగా పోరాటం

Sep 17 2016 6:14 PM | Updated on Sep 4 2017 1:53 PM

రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యంగా పోరాటం

రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యంగా పోరాటం

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు మరింతగా ఉధృతంగా పోరాటం చేస్తామని పలువురు అఖిలపక్ష నాయకులు తెలిపారు.

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు మరింతగా ఉధృతంగా పోరాటం చేస్తామని పలువురు అఖిలపక్ష నాయకులు తెలిపారు. శనివారం స్థానిక ఇందిరా సెంటర్‌లో నియోజకవర్గ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ విద్యార్థి జేఏసీ కన్వీనర్‌ కుక్కడపు మహేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్నగౌడ్, పాలకూరి బాబు, జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్‌నాథరెడ్డి, మేకల నాగేశ్వరరావు, పీవీ.దుర్గాప్రసాద్, అట్లూరి హరిబాబు, వట్టికూటి జంగమయ్య, ములకలపల్లి సీతయ్య, జక్కుల మల్లయ్య, శివరాం యాదవ్, ఎస్‌కే.సైదా, విజయ్, యరగాని గురవయ్య, కోల మట్టయ్య, చిలకరాజు లింగయ్య, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, సుతారి వేణు, బాచిమంచి గిరిబాబు, పండ్ల హుస్సేన్‌గౌడ్‌ పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement