ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

Published Tue, Aug 16 2016 5:56 PM

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి - Sakshi

డీపీఓ అరుణ

శామీర్‌పేట్‌: ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని డీపీఓ అరుణ అన్నారు. ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమాల గురించి తెలుసుకుని మాట్లాడారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మండలంలోని 8 గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది డీపీఓను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌, ఎంపీడీఓ జ్యోతి, ఈఓపీఆర్డీ శ్రీనివాస్‌ గుప్త, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement