నంద్యాల ఎస్డీఆర్ స్కూల్ మైదానంలో జిల్లాస్థాయి అండర్–17 రగ్బీ బాలబాలికల జట్లకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సి. రామాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
27న జిల్లా స్థాయి రగ్బీ జట్టు ఎంపిక
Nov 21 2016 11:28 PM | Updated on Sep 4 2017 8:43 PM
కర్నూలు(టౌన్): నంద్యాల ఎస్డీఆర్ స్కూల్ మైదానంలో జిల్లాస్థాయి అండర్–17 రగ్బీ బాలబాలికల జట్లకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సి. రామాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 28న నంద్యాల ఎస్డీఆర్ స్కూలు మైదానంలో నిర్వహిస్తున్న 62వ రాష్ట్ర స్థాయి స్కూలుగేమ్స్ రగ్బీ (అండర్–17) పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే ఆసక్తి కలిగిన క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో 27వ తేదీ మధ్యాహ్న 3 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Advertisement


