తప్పిన పెను ప్రమాదం | danger miss in shcool | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Feb 3 2017 11:58 PM | Updated on Sep 5 2017 2:49 AM

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం పై పెచ్చులు శుక్రవారం ఉన్నఫలంగా ఊడిపడ్డాయి.

హిందూపురం రూరల్‌ : శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం పై పెచ్చులు శుక్రవారం ఉన్నఫలంగా ఊడిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పిందని ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్‌ తెలిపారు. వివరాలు.. మండలంలోని పూలకుంట ప్రాథమిక పాఠశాలలో 40 ఏళ్ల క్రితం భవనం నిర్మించారు. ప్రస్తుతం పాఠశాల గది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో పిల్లలతో పాటు ఉపాధ్యాయులు ప్రార్థన చేస్తున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం గ్రామ సర్పంచ్‌ హనుమంతరాయప్ప వచ్చి గది పరిశీలించారు. ఈ విషయమై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement