విజయపురిసౌత్ : నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను వివరించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గవర్నర్ను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయపురిసౌత్లోని మాచర్ల జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల్లో సైతం చిన్ననోట్లు అందుబాటులోకి రాలేదన్నారు. రైతులు, సన్న, చిన్నకారు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసినా ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంపై ప్రధానికి స్వయంగా లేఖ రాశానని చెప్పటమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన బాధ్యత అటు ప్రధాని మోదీపై, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ రాష్ట్ర గవర్నర్ను మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసి ప్రజల బాధలను వివరిస్తామన్నారు. అనంతరం జెడ్పీటీసీ గోపిరెడ్డి విజయపురిసౌత్లో పారిశుధ్య సిబ్బంది లేకపోవటంతో ఎక్కడ చెత్త అక్కడే నిలిచి వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయని, సిబ్బంది నియామకం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకులు జూలకంటి వీరారెడ్డి, బూడిద శ్రీను తదితరులు ఉన్నారు.
నోట్ల కష్టాలు గవర్నర్కు విన్నవిస్తాం
Published Mon, Dec 19 2016 9:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement