వికలాంగుల సాంస్కృతిక పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

వికలాంగుల సాంస్కృతిక పోటీలు ప్రారంభం

Published Sun, Aug 28 2016 1:01 AM

వికలాంగుల సాంస్కృతిక పోటీలు ప్రారంభం

న్యూశాయంపేట : జ్యోతిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా మానసిక వికలాంగులకు, అనాథలకు నిర్వహిస్తున్న సాంస్కృతిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో కలెక్టర్‌ వాకాటి కరుణ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా జిల్లాలోని 40 స్వచ్ఛంద సంస్థలకు చెందిన వికలాంగ, అనాథలు 200 మంది ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అనాథ పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్‌ అధ్యక్షురాలు దూదిబాల జ్యోతిరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి, రాజారపు ప్రతాప్, విజయ్‌పాల్‌రెడ్డి, జ్యోతిష్, రామలీల, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement