బాబాకు బంగారు కిరీటం బహూకరణ | crown gift to temple | Sakshi
Sakshi News home page

బాబాకు బంగారు కిరీటం బహూకరణ

Jul 20 2016 12:01 AM | Updated on Sep 4 2017 5:19 AM

మండలంలో గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.

 
సాక్షి, మంగళగిరి : మండలంలో గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పెదవడ్లపూడి గ్రామంలో దక్షిణ షిరిడీ సాయి బాగా ప్రసిద్ధి చెందిన సాయి మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథునికి చిల్లపల్లి షోరూం అధినేత శ్రీనివాసరావు బహూకరించిన వందకాసుల బంగారు కిరీటాన్ని తొడిగారు. అనంతరం మందిరంలో మంత్రి గంటాను సన్మానించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement