కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణలక్ష్మి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కనుల పండువగా సాగాయి. తొలుత ఆలయంలో నారసింహుడితో పాటు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడికి మహిళా భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు.
అర్చక బృందం అమ్మవారికి పూజలు నిర్వహించిన మీదట ప్రధాన అర్చకులు వరలక్ష్మీ వ్రతం విశేషాన్ని వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, సభ్యులు రఘునాథరెడ్డి, కటికెల వరలక్ష్మి, కరె నాగరాజు, రొడ్డారపు నాగరాజు, గంగులమ్మ, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
కనులపండువగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
Published Fri, Aug 18 2017 10:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement