భక్తిశ్రద్ధలతో క్రిస్మస్
నెల్లూరు(బృందావనం): జిల్లాలోని క్రైస్తవులు ఆదివారం క్రిస్మస్ పండగను భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రైస్తవులతో బాలఏసు నగరోత్సవం నెల్లూరులో రాత్రి కనులపండువగా జరిగింది. తొలుత బాల ఏసును స్మరిస్తూ క్రైస్తవులు క్యాండిల్స్ వెలిగించి, ప్రార్థనలు చేశారు.


