షష్టిపూర్తి వేడుకలకు హాజరైన చిరంజీవి | Chiranjeevi attended the celebrations | Sakshi
Sakshi News home page

షష్టిపూర్తి వేడుకలకు హాజరైన చిరంజీవి

Aug 27 2016 11:41 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండ గడీకోటలో శనివారం తన వియ్యంకుడు, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్‌ అయిన కామినేని అనిల్‌కుమార్‌ షష్టిపూర్తి కార్యక్రమానికి

 
దోమకొండ : నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండ గడీకోటలో శనివారం తన వియ్యంకుడు, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్‌ అయిన కామినేని అనిల్‌కుమార్‌ షష్టిపూర్తి కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రాంచరణ్‌తేజ, ఆయన సతీమణి ఉపాసనలు హాజరయ్యారు. గడీకోటలోని మహదేవుని ఆలయంలో ఉదయం నుంచి షష్టిపూర్తి కార్యక్రమం సందర్భంగా పూజలు నిర్వహించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, రిటైర్డు ఐఏఏస్‌ అధికారి కామినేని ఉమాపతిరావ్, తదితరులు అనిల్‌కుమార్‌ దంపతులను∙దీవించారు. రాత్రి చిరంజీవి డిన్నర్‌కు హాజరై తిరిగి వెళ్లిపోయారు. రాంచరణ్‌ మాత్రం ఆయన సతీమణితో కలిసి ఇక్కడే ఉన్నారని గడీకోట ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement