మరోసారి చింతమనేని బాధితుల ఆందోళన | chintamaneni baditula andolana | Sakshi
Sakshi News home page

మరోసారి చింతమనేని బాధితుల ఆందోళన

Sep 8 2016 11:35 PM | Updated on Sep 4 2017 12:41 PM

మరోసారి చింతమనేని బాధితుల ఆందోళన

మరోసారి చింతమనేని బాధితుల ఆందోళన

సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతమనేని వైఖరిని నిరసిస్తూ దుగ్గిరాల రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇటీవల పట్టిసీమ నుంచి విడుదల చేసిన నీటికారణంగా మునిగిపోయిన తమ చెరువుల్లో గురువారం సాయంత్రం వారు పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామం పొలాల్లో ఆందోళన చేశారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతమనేని వైఖరిని నిరసిస్తూ దుగ్గిరాల రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇటీవల పట్టిసీమ నుంచి విడుదల చేసిన నీటికారణంగా మునిగిపోయిన తమ చెరువుల్లో గురువారం సాయంత్రం వారు పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామం పొలాల్లో ఆందోళన చేశారు. తాను చేపలు పెంచుతున్న చెరువుకు నీరు పెట్టేందుకు తమ పొలాలను ముంచేశాడని వారు ఆరోపించారు. పొలాలు మునిగిపోయాయని ఆందోళన చేసినా పట్టించుకోలేదని, పైగా బెదిరింపులకు దిగారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో పంట పూర్తిగా పనికిరాకుండా పాడైపోయిందని, అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తే, తమకు వ్యతిరేకంగా బయట గ్రామాలకు చెందిన రైతు కూలీలను, రైతుల రూపంలో కూర్చొపెట్టి వారితో ఆరోపణలు చేయించాడని వారు ఆరోపించారు. పోలవరం కాలువ నీళ్లను చెరువులను నింపేందుకని అక్రమంగా తరలిస్తున్న ఫలితంగా దుగ్గిరాలలో పలువురి రైతుల పొలాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రైతులు గత శనివారం కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగిన సంగతి విదితమే.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement