కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి | Breakthrough in Krupamani suicide case | Sakshi
Sakshi News home page

కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి

Nov 1 2015 10:26 AM | Updated on Sep 3 2017 11:50 AM

కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి

కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి కనిపించింది.

ఏలూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి కనిపించింది. ఈ కేసులో నిందితుడైన కృపామణి తండ్రి రామలింగేశ్వరరావును ఆదివారం దెందులూరులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖలో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాసరావు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హైవే టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా గుడాల సాయిశ్రీనివాస్ విశాఖపట్టణంలోనే ఉన్నట్టు పోలీసులు సమాచారం అందింది. సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement