అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందని ..
సిద్దిపేట రూరల్: అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన కరీంనగర్ వెళుతూ మార్గమధ్యంలో సిద్దిపేట వద్ద కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఉండాలని కోరుకుంటోందని విమర్శించారు. రాష్ట్రమంతా కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు.