ఉల్లిసాగుతో లాభాలు | benefits of onion crop | Sakshi
Sakshi News home page

ఉల్లిసాగుతో లాభాలు

Aug 17 2016 5:45 PM | Updated on Sep 4 2017 9:41 AM

ఉల్లిగడ్డ పంట

ఉల్లిగడ్డ పంట

ఉల్లి సాగు చేసేందుకు రైతులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో కూడా ఉల్లికి మంచి ధర ఉంది. దీంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

  • పంటను కాపాడేందుకు అధికారుల సూచనలు, సలహాలు తప్పని సరి
  • జిన్నారం: ఉల్లి సాగు చేసేందుకు రైతులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో కూడా ఉల్లికి మంచి ధర ఉంది. దీంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. ఉల్లి సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి తెగుళ్లు వస్తాయి, రోగాల నివారణకు ఏమేమి చర్యలు తీసుకోవాలనే విషయమై ఉద్యానశాఖ అధికారి అనిల్‌కుమార్‌ (సెల్‌ : 8374449348)సలహాలు, సూచనలు చేస్తున్నారు.

    పంటను విత్తే సమయం
    ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌-జులై నుంచి అక్టోబర్‌- నవంబర్‌ వరకు సాగు చేయవచ్చు. వేసవి పంటగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో కూడా పంట వేసుకోవచ్చు

    పంట సాగుకు ఉండాల్సిన నేల :
    ఉల్లి సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన మెరక నేల అవసరం. ఉప్పు, చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు.

    సోకే తెగుళ్లు : నివారణ చర్యలు :

    1. తామర పురుగు :
    లక్షణాలు : ఈ పురుగు మొక్కల ఆకుల మొవ్వలలో ఉండి రసాన్ని పీలుస్తుంది. దీని వలన ఆకులమీద తెల్లని మచ్చలు వస్తాయి. దీంతో ఆకులు కొనల నుంచి కింది వరకు ఎండిపోతాయి.
    నివారణ : తామర పురుగు నివారణకు లీటర్‌ నీటికి ఒక మిల్లీలీటర్‌ 0.05శాతం 50ఇసీ మిథైల్‌ పారథియాన్‌ మందును వేసి పంటపై పిచికారి చేయాలి.

    2. నారుకుళ్లు తెగులు :
    లక్షణాలు : ఈ తెగులు సోకటంతో నారుమడిలోని మొలకెత్తు విత్తనాలను, నారును ఆశిస్తుంది. దీంతో పంట ఎదగదు.
    నివారణ చర్యలు : దీని నివారణకు 1శాతం బోర్డో మిశ్రమంతో గాని లేదా, 0.3శాతం సెరసాన్‌తో గాని నేలను బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి.
    3. ఆకులను తినే గొంగళి పురుగు :
    లక్షణాలు : పంట ఎదుగుతున్న సమయంలో పంటకు గొంగళి పురుగులు వస్తాయి. ఇవి ఆకులను పూర్తిగా తినేస్తాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది.
    నివారణ చర్యలు : గొంగళి పురుగు నివారణకు 2మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్‌ మందను మందును ఒక లీటర్‌ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి.

    ఆకుమచ్చ తెగులు :
    ల„ýక్షణాలు :
    ఆకుమచ్చ తెగులు వాతావర ణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు సోకుతుంది. ప్రారంభ దశలో ఆకుల మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు సోకిన ఆకులు వాలిపోయి ఎండిపోతాయి.
    నివారణ చర్యలు :
    దీనినివారణ చర్యలకు సమయానుకూలంగా 1శాతం బోర్డో మిశ్రమాన్ని 15రోజుల వ్యవధిలో చల్లాలి.

    అందుబాటులో విత్తనాలు :
    75శాతం సబ్సీడీపై విత్తనాలను అందించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రకాల విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కిలో ఉల్లిగడ్డ విత్తనాలు రూ. 1350 ధర ఉండగా, 75శాతం సబ్సిడీపై రూ. 350కి విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement