బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే | babu talks all false | Sakshi
Sakshi News home page

బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే

Feb 21 2017 1:08 AM | Updated on Aug 29 2018 6:26 PM

బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే - Sakshi

బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే

రాష్ట్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, రాయలసీమను మరోసారి దారుణంగా మోసం చేస్తున్నార ని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్‌) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు.

= సీమను ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది 
= బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజం 
అనంతపురం న్యూటౌన్  : రాష్ట్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, రాయలసీమను మరోసారి దారుణంగా మోసం చేస్తున్నార ని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్‌) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. రాయలసీమ యునైటెడ్‌ ఫోరం తరఫున పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డికి మద్దతుగా సోమవారం అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా బైరెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి అంటూ ఉన్నదంతా ఊడ్చేసి అక్కడ పెడితే రాయలసీమ మాటేమిటని ప్రశ్నించారు. సీమకు నీళ్లు, నిధుల గురించి మాట్లాడని చంద్రబాబు.. అవసరమొస్తే సీమవాదం ఎత్తుకుంటారని దుయ్యబట్టారు.  పుష్కరాల పేరిట రూ.కోట్లు తగలేసిన ప్రభుత్వం.. సీమలో వలసలు పోతుంటే మాటమాత్రమైనా ప్రస్తావించడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నాగార్జునరెడ్డి, ప్రఖ్యాత కథా రచయిత బండినారాయణస్వామి, రాయలసీమ విమోచన సమితి జిల్లా కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు భార్గవ్, నాయకులు రాధాకృష్ణరావు,  కృష్ణకుమార్‌   పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement