స్పీకర్‌ కోడెలపై ఈసీకి ఫిర్యాదు: అంబటి | Ambati To File A Complaint Against Kodela To The EC | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ కోడెలపై ఈసీకి ఫిర్యాదు: అంబటి

Jun 28 2016 2:07 PM | Updated on Jul 29 2019 2:44 PM

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై ఎన్నికల కమీషన్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయనుంది.

హైదరాబాద్‌ : ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుపెట్టినట్లు ఓ చానల్‌లో స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు ప్రకటించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో  అంబటి బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన ఎన్నికల కమీషనర్‌ భన్వర్‌లాల్‌ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేసిన స్పీకర్‌ కోడెలపై సుమోటోగా చర్యలు తీసుకుని ఆయన్ను అనర్హునిగా ప్రకటించాలని అంబటి కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement