ముసుగులు ధరించి దాడి.. వీడియో వైరల్‌ !

Youth Thrashed By Masked Men With Sticks in Uttar Pradesh - Sakshi

మథుర: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని కొంతమంది ముసుగులు ధరించి కర్రలతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి.. ‘ కొద్దికాలంగా ఓ వ్యక్తి నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. గత హోలీ వేడుకల సమయంలో అతనిపై నేను పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అందుచేతనే వారు ఈ దారుణానికి దిగారు’ అని బాధితుడు పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి అరెస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ దాడిపై నెటిజన్లు మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌ చేసే పోలీసుల ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. వావ్‌.. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్‌ అడర్‌ అభివృద్ది చెందిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top