వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్‌

మృతురాలు మంజు గోయల్‌ - Sakshi

దక్షిణ ఢిల్లీలో దారుణం

ఇంటి ఓనర్, అతని కొడుకు అరెస్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఇంటి ఓనర్, అతని కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా కొట్టిన దెబ్బలకు 44 ఏళ్ల వితంతువు మృతి చెందింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగింది.  పోలీసుల వివరాలు ప్రకారం.... హతురాలు మంజు గోయల్‌ (44) భర్త ఏడాది కిందట మరణించాడు. ఆమె ఆరు నెలలుగా మెహ్రౌలీలోని సతీష్‌ పహ్వా అనే ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంట్లో అద్దెకు ఒంటరిగా నివసిస్తున్నారు. రెండు రోజుల కిందట సతీష్‌ పహ్వా ఇంట్లో కొన్ని వస్తువులు, సుమారు రూ.47వేల నగదు చోరీకి గురయ్యాయి. 

ఈ దొంగతనం చేసింది మంజు గోయెలేనని అనుమానించిన సతీష్‌ పహ్వా కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న మంజు గోయల్‌ సోదరుడు ఘటనా స్థలానికి రాగా అతడిపైనా దాడి చేశారు. ఈ ఘటనపై హతురాలి సోదరుడు, స్థానికులు మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇంటి ఓనర్‌ సతీష్‌ పహ్వా (54), అతని కుమారుడు పంకజ్‌ (29)లపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top