గౌతమి గోదావరిలో ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆలమూరు: స్నానం కోసం గౌతమి గోదావరి నదిలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో జరిగింది. మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన తలారి ధర్మేంద్ర, గంటా వికాస్ అనే యువకులు గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువ ఉండడం, ఈత రాకపోవడంతో వారు గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు.