ఘోర రోడ్డు ప్రమాదం..! | Two died In Road Accident In Tadepalligudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Feb 9 2019 10:02 AM | Updated on Feb 9 2019 11:43 AM

Two died In Road Accident In Tadepalligudem - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమగోదావరి : పెద్ద తాడేపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. హైవే పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఇనుపరేకులు మెడలోకి చొచ్చుకుపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 

వివరాలు.. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వారపరెడ్డి శ్రీనివాస్‌ అతని భార్య అన్నపూర్ణ(50), మనవడు ఆరుష్‌(1) ని తీసుకుని కృష్ణా జిల్లా గుంటుమిల్లికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్‌ చేస్తున్న శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య , మనవడు మృతి చెందారు. నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో గాయపడిన శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement