పీక్లానాయక్‌ తండాలో ఉద్రిక్తత | Tension In Peekla Nayak Thanda | Sakshi
Sakshi News home page

పీక్లానాయక్‌ తండాలో ఉద్రిక్తత

May 10 2019 4:06 PM | Updated on May 10 2019 4:51 PM

Tension In Peekla Nayak Thanda - Sakshi

సూర్యాపేట: చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీక్లానాయక్‌ తండాలో పాల్గొన్నారు. ఉత్తమ్‌ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్‌ కార్యకర్తలు చితకబాదారు.



ఈ ఘటనతో అక్కడి వాతావరణం మారిపోయింది. ప్రతీకారంగా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్‌ఎస్‌ వర్గ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. పరస్పర దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement