హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య | Student Commits Suicide in Hostel Karnataka | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

Jan 21 2020 8:42 AM | Updated on Jan 21 2020 8:42 AM

Student Commits Suicide in Hostel Karnataka - Sakshi

కావ్య (ఫైల్‌)

కావ్య ఆత్మహత్యపై తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.

కర్ణాటక,శివమొగ్గ: బాలిక ఉరేసుకున్న స్థితిలో మరణించిన సంఘటన సోమవారం నగరంలోని ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. శికారిపురకు చెందిన కావ్య (15) నగరంలోని మేరి ఇమ్యాక్యులేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటూ అదే పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉండేది. ఈ క్రమంలో సోమవారం హాస్టల్‌ స్టోర్‌రూమ్‌లో కావ్య ఉరేసుకొన్న స్థితిలో శవమై తేలింది. గమనించిన పాఠశాల సిబ్బంది హాస్టల్‌లో ఉంటున్న మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న కోటా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కావ్య ఆత్మహత్యపై తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గతనెలలో జరిగిన పరీక్షల్లో కన్నడలో తక్కువ మార్కులు రావడంతో ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులు కూడా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement