కిడ్నాపైన విద్యార్థి దారుణహత్య | School Student Kidnap And Murder In Anantapur District | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన విద్యార్థి దారుణహత్య

Mar 7 2018 10:01 PM | Updated on Jul 12 2019 3:02 PM

School Student Kidnap And Murder In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 45 రోజుల కిందట అదృశ్యమైన 3వ తరగతి విద్యార్థి గౌతం దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి నెలలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడు గౌతంను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు బి.యాలేరు చెరువులో బాలుడి మృతదేహం ఉందంటూ సమాచారం అందింది. చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాగా తెలిసిన వారే బాలుడిని హత్య చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement