ఐదు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది | Sakshi
Sakshi News home page

ఐదు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది

Published Sat, Apr 28 2018 8:58 AM

Orange Travells Bus Collided With Bike In Miryalaguda - Sakshi

నల్లగొండ జిల్లా : మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు, ఎదురుగా వస్తోన్న బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం బైక్‌ను సుమారు 5 కిలో మీటర్ల దూరం బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న బనావత్‌ రూపల్ల(37) బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంతో భయపడిపోయిన బస్‌డ్రైవర్‌ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement