బయటపడిన రైల్వే ఉద్యోగాల మోసం

Mumbai Gang Arrested In Railway Jobs Fraud In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బోల్తా కొట్టించిన ఓ ముఠా బాగోతం బుధవారం బయటపడింది. ముంబైకి చెందిన మిత్రా, నాగూర్‌, వరుణ్‌ యశ్వంత్‌ సోలంకి విజయవాడ కేంద్రంగా ఈ మోసానికి తెరలేపారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు అమ్ముతామంటూ బేరం పెట్టిన కేటుగాళ్లు.. నగరంలోని ఓ ​ప్రముఖ హోటల్‌లో ఫేక్‌ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఈ తతంగంపై అనుమానం వచ్చిన చిరంజీవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూల సందర్భంగా నిరుద్యోగుల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు యత్నించినట్టు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top