సిరిసిల్లలో తల్లి,కుమార్తె ఆత్మహత్య
సాక్షి, సిరిసిల్ల: తల్లి, బిడ్డ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన సిరిసిల్లలో గురువారం చోటుచేసుుకంది. సిరిసిల్లలోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న తల్లి గుడ్ల విజయ(60), కూతురు జ్యోతి (35) ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతోనే వీళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.