ఇద్దరు కుమారులతో సహా తల్లి అదృశ్యం | Mother And Child Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమారులతో సహా తల్లి అదృశ్యం

Mar 1 2019 11:07 AM | Updated on Mar 1 2019 11:07 AM

Mother And Child Missing in Hyderabad - Sakshi

కుమారులతో షేక్‌ సుల్తానా (ఫైల్‌)

మల్కాజిగిరి: భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ అశోక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.షఫీనగర్‌కు చెందిన షేక్‌ అహ్మద్, షేక్‌ సుల్తానా దంపతులకు రహ్మద్‌(7), అయాన్‌(4) కుమారులు ఉన్నారు. ఈ నెల 27న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో సుల్తానా గాంధీనగర్‌లో ఉంటున్న తన తల్లి తహీరాబేగంకు  ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె సుల్తానా ఇంటికి వచ్చి వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, ఆమె పట్టించుకోకుండా ఇద్ద రు కుమారులను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. గాంధీనగర్‌లో ఇంటి వద్దకే వెళ్లి ఉంటుందని భావించి తహీరాబేగం ఇంటికి వచ్చి చూడగా, అక్కడ కుమార్తె కనిపించకపోవ డంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement