త‌ల్లి న‌గ్న చిత్రాల‌తో బ్లాక్ మెయిల్ 

Man Blackmails Mother By Her Obscene Pics For Property In Rajasthan - Sakshi

జైపూర్‌ : ప్ర‌త్య‌క్ష‌ దైవంగా భావించాల్సిన‌ క‌న్న‌త‌ల్లిపై దారుణానికి దిగాడో ప్ర‌బుద్ధుడు. ఆస్థి కోసం ఆమె ర‌హ‌స్య చిత్రాల‌ను వాట్సాప్ గ్రూపుల్లో పంపి నీచానికి ఒడిగ‌ట్టాడు. రాజ‌స్థాన్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. రాజ‌స్థాన్‌కు చెందిన  ఓ డెబ్బై అయిదేళ్ల వ‌ద్ధురాలి భ‌ర్త 22 రోజుల క్రిత‌మే మ‌ర‌ణించాడు. అప్ప‌టినుంచి ఆస్థి త‌న పేరున రాయాలంటూ ఆమె యాభైయేళ్ల కొడుకు రాబంధులా పీక్కు తిన‌డం మొదలు పెట్టాడు. ఈ క్ర‌మంలో మే 13న ప‌నిలో నిమ‌గ్న‌మైన త‌ల్లిపై ఏదో ద్ర‌వ ప‌దార్థం చ‌ల్లాడు. దీంతో ఆమె చ‌ర్మంపై దుర‌ద మొద‌ల‌వ‌గా, వెంట‌నే స్నానానికి  వెళ్లి బ‌ట్ట‌లు మార్చుకుంది. (దారుణం : గాడిదల్ని దొంగలించారని...)

దీన్నంత‌టినీ ఆమె కుమారుడు దొంగ‌‌చాటుగా‌ ఫొటోలు తీశాడు. అనంత‌రం ఆమె న‌గ్న ఫొటోల‌ను వాట్సాప్‌లో బంధువుల‌కు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఆస్థి ప‌త్రాల‌పై సంత‌కం పెట్టాలంటూ వేధించాడు. కొడుకు చేసిన నీచ‌ప‌నికి ఆక్రోశం చెందిన త‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌డు పంపించిన న‌గ్న చిత్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. (కోడిగుడ్లు తిన్నాడని.. సుత్తితో కొట్టి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top