లైంగిక వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆకతాయిల లైంగిక వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పీలేరులో జరిగింది. పీలేరు బండ్ల వీధికి చెందిన విజయలక్ష్మిని అదే వీధికి చెందిన కొంత మంది యువకులు వేధించడంతో మనస్తాపం చెంది ఈ రోజు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(చదవండి: బైక్ తాకినందుకు రోడ్డుపైకి ఈడ్చి దాడి)