ముగ్గురు చిన్నారులను చెరువులో ముంచి.. | Father Eliminates 3 Children In Kamareddy District | Sakshi
Sakshi News home page

కసాయి తండ్రి: ముగ్గురు కూతుళ్ల దారుణ హత్య!

Mar 6 2020 2:24 PM | Updated on Mar 6 2020 3:06 PM

Father Eliminates 3 Children In Kamareddy District - Sakshi

గురువారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు.. అఫియా (10), మహీన్ (9), జియా( 7) రాజారాం దుబ్బ చెరువులో విగతజీవులై కనిపించారు.

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ  మండలం తాడ్కోల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫయాజ్‌ అనే కసాయి తండ్రి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు.. అఫియా (10), మహీన్ (9), జియా( 7) రాజారాం దుబ్బ చెరువులో విగతజీవులై కనిపించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృత దేహాలు శుక్రవారం బయటపడ్డాయి. కుటుంబ కలహాలతోనే తండ్రి ఫయాజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement