సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్యకేసులో అటు పోలీసులు.. ఇటు ప్రభుత్వ వైద్యులు అనుసరించిన తీరు, కేసును నీరుగార్చే కుట్రలు బట్టబయలయ్యాయి. ఈ కేసులో పోలీసులు జ్యోతి మృతదేహంపై దుస్తులు, వేలిముద్రలను సేకరించకుండా ఖననం చేయడం.. ఆ తరువాత దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు సేకరించడంతో అనుమానాలు వెల్లువెత్తగా రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో చీకటి కోణం వెలుగు చూసింది. సంచలనాత్మకమైన కేసులో పకడ్బందీగా పోస్టుమార్టం నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించిన తీరు బయటపడింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ జి.విజయభారతి జ్యోతి మృతదేహానికి అసలు పోస్టుమార్టమే నిర్వహించకుండా పొట్టపై చిన్న గాటు పెట్టి కుట్లు వేసి పంపించిన వైనం బయటపడడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు. జ్యోతి తలపై రాడ్డు లాంటి ఆయుధంతో బలంగా కొట్టడం వల్లే ఆమె మృతిచెందిందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పోస్టుమార్టం సమయంలో మృతదేహం తలపై చిన్న గాటు కూడా పెట్టిన దాఖలాలు లేవంటే పోస్టుమార్టం ఏవిధంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి హత్య కేసులో ప్రభుత్వ వైద్యురాలు ఈ విధంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇవి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పులు కావని, కుట్రపూరితంగా కేసును పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం చేసినవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డాక్టర్ విజయభారతిపై చర్యలు షురూ..
జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయభారతిని రెండు రోజుల క్రితం పిలిపించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించి రీపోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వేటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమెను సస్పెండ్ చేసి వదిలేస్తారా.. లేక క్రిమినల్ కేసు సైతం నమోదు చేస్తారా? అనే విషయంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే జ్యోతిని రాడ్డు లాంటి బలమైన ఆయుధంతో తలపై బలంగా కొట్టడం వల్ల తల లోపల పుర్రె ముక్కలు ముక్కలైనట్లు రీపోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. జ్యోతిది కేవలం హత్య మాత్రమేనని, ఆమెపై ఎటువంటి లైంగిక దాడులు జరగలేదని కూడా తేలినట్లు సమాచారం.
స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చిన శ్రీనివాసరావు
జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు ఏవిధంగా కుట్ర చేశాడనే వైనాన్ని పోలీసులు పూర్తిగా ఆధారాలతో సేకరించినట్లు తెలిసింది. అతని వద్ద పనిచేసే పవన్ పోలీసుల అదుపులో అసలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే పవన్ సహాయం తీసుకున్నాడా.. అసలు జ్యోతిని ఎలా హతమార్చారు.. శ్రీనివాసరావుకు తగిలిన గాయం ఎవరు చేశారు.. అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే శ్రీనివాసరావు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించకపోవడంతో ఆసుపత్రి నుంచి నేడో, రేపో డిశ్చార్జి చేసి అరెస్టు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. అయితే రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీ నేతలు కేసును పక్కదారి పట్టించేందుకు అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ వైద్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో పాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరెవరిపై వేటు పడుతుందో వేచి చూడాలి.
కేసు ముగించే కుట్ర
Published Tue, Feb 19 2019 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement