మద్యం మత్తులో హడలెత్తించిన డ్రైవర్‌ | Bus Driver Drunk And Drive In Banglore | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో హడలెత్తించిన బీఎంటీసీ డ్రైవర్‌

Mar 22 2018 9:35 AM | Updated on May 25 2018 2:06 PM

Bus Driver Drunk And Drive In Banglore - Sakshi

స్టీరింగ్‌ ముందు లోకేష్‌

బనశంకరి: మద్యం సేవించి వాహనాన్ని నడిపి ప్రయాణికులను హడలెత్తించిన బీఎంటీసీ డ్రైవర్‌ ఉదంతం బుధవారం బెంగళూరులో కలకలం సృష్టించింది. శాంతినగర్‌ బస్‌ డిపోకు చెందినడ్రైవర్‌ లోకేష్‌ బుధవారం ఉదయం బస్సులో  ఎక్కించుకొని మెజిస్టిక్‌ నుంచి తలఘట్టపురకు బయలుదేరాడు. అప్పటికే మద్యం సేవించిన లోకేశ్‌..సారక్కి సిగ్నల్‌ వద్దకు చేరుకోగానే ముందున్న ఇన్నోవా వాహనాన్ని  ఢీకొట్టాడు. కోపోద్రిక్తుడైన ఇన్నోవా వాహనదారుడు బస్సులోకి ఎక్కి  డ్రైవర్‌ను ప్రశ్నించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది.  ఘటన గురించి తెలుసుకున్న బీఎంటీసీ అధ్యక్షుడు నాగరాజ యాదవ్‌ మాట్లాడుతూ.. ఇది క్షమించారాని నేరమని, మద్యం తాగి బస్సు నడిపిన లోకేశ్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement