బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య | Bank Emoployee Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Dec 13 2019 8:00 AM | Updated on Dec 13 2019 8:00 AM

Bank Emoployee Commits Suicide in Karnataka - Sakshi

భార్య, కుమారుడితో మంజునాథ్‌ (ఫైల్‌)

కర్ణాటక, ముళబాగిలు : ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి కలిగి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నగరంలో చోటుచేసుకుంది. స్టేట్‌ బ్యాంక్‌లో విస్తరణ అధికారిగా పనిచేస్తున్న మంజునాథ్‌ (35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకాలోని గుమ్లాపుర గ్రామానికి చెందిన మంజునాథ్‌ ముళబాగిలు ఎస్‌బీఐ బ్యాంకు విస్తరణాధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కొందరితో కలిసి ముత్యాల పేటలో ఓ సూపర్‌ బజార్‌ ప్రారంభించారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement