న్యూసెన్స్‌ చేసిన ముగ్గురు హిజ్రాలకు జరిమానా | 6 Thousand Fine To Three Hijras | Sakshi
Sakshi News home page

న్యూసెన్స్‌ చేసిన ముగ్గురు హిజ్రాలకు జరిమానా

Jun 2 2018 10:36 AM | Updated on Oct 2 2018 4:31 PM

6 Thousand Fine To Three Hijras - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాజీపేట రూరల్‌ : రైళ్లలో న్యూసెన్స్‌ చేసిన ముగ్గురు హిజ్రాలకు కాజీపేట రైల్వే కోర్టు మెజిస్ట్రేట్‌ శుక్రవారం జరిమానా విధించినట్లు స్థానిక ఆర్‌పీఎఫ్‌  ఎస్సై శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి నడుస్తున్న రైలు చైన్‌ లాగి రైలు ఆపిన ఒక హిజ్రాను, శుక్రవారం గుంటూరు నుంచికింద్రాబాద్‌ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులతోసభ్యకరంగా ప్రవర్తించిన మరో హిజ్రాలను అదుపులోకి తీసుకొని కేసులు నమో దు చేసి రైల్వే కోర్టు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా,  వారికి రూ.6 వేల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్‌ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement