తప్పుడు వార్తలకు ట్విటర్‌ చెక్‌ | Twitter to Labelling Fake News | Sakshi
Sakshi News home page

తప్పుడు వార్తలకు ట్విటర్‌ చెక్‌

Feb 6 2020 10:27 AM | Updated on Feb 6 2020 10:31 AM

Twitter to Labelling Fake News - Sakshi

తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది.

న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇలాంటి ట్వీట్‌లకు ప్రత్యేక ముద్ర వేయనుంది. ప్రజలకు హానిచేసే విధంగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు ట్వీట్‌లను పూర్తిగా తొలగించేందుకు ట్విటర్‌ చర్యలు తీసుకుంటుంది. తెలిసో తెలియకో తప్పుదోవ పట్టించేలా రూపొందించిన మీడియా, ట్వీట్‌లను షేర్‌ చేయదల్చుకునే యూజర్లను ముందస్తుగా హెచ్చరించేలా సాంకేతికతను ఉపయోగించనుంది. విషయం గురించి యూజర్లకు మరింత వివరంగా తెలిసేందుకు సదరు పోస్ట్‌లపై వివరణ పొందుపర్చనుంది. మార్చి 5 నుంచి తప్పుడు ట్వీట్లను లేబులింగ్‌ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ట్విటర్‌ వెల్లడించింది. (చదవండి: యూట్యూబ్‌ కీలక నిర్ణయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement