క్రిప్టోకరెన్సీలపై తక్షణ చర్యలేమీ లేవు

There are no immediate reactions on cryptocarcin - Sakshi

కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైటీ

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్‌ వంటి క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం తక్షణ చర్యలు తీసుకునే యోచనేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. వర్చువల్‌ కరెన్సీలపై అధ్యయనానికి నియమించిన నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాతే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం రాజ్యసభలో ఈ విషయాలు తెలియజేశారు. పెట్టుబడుల వెల్లువతో బిట్‌కాయిన్‌ విలువ రూ.10 లక్షల స్థాయికి పైగా ఎగిసింది.

ఈ నేపథ్యంలో ఇలాంటి క్రిప్టోకరెన్సీలు మోసపూరిత పోంజీ స్కీముల్లాంటివని.. వీటికి దూరంగా ఉండాలని కేంద్రం, ఆర్‌బీఐ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్చువల్‌ కరెన్సీలు, వాటి ద్వారా మనీలాండరింగ్‌ అవకాశాలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ, హోం శాఖ, ఆర్‌బీఐ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top