ఎంఎస్‌ఎంఈలకు నిధుల కోసం ఎల్‌ఐసీతో సిడ్బి ఒప్పందం | SIDBI signs MoU with LIC for Fund-of-Fund operations | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు నిధుల కోసం ఎల్‌ఐసీతో సిడ్బి ఒప్పందం

Apr 9 2016 12:45 AM | Updated on Sep 3 2017 9:29 PM

స్టార్టప్‌లు, లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహామివ్వడానికి ఎల్‌ఐసీతో...

హైదరాబాద్: స్టార్టప్‌లు, లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహామివ్వడానికి ఎల్‌ఐసీతో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బి) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని సిడ్బి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎల్‌ఐసీతో కలిసి ఒక నిధిని (ఫండ్) ఏర్పాటు చేస్తామని సిడ్బి సీఎండీ శివాజీ పేర్కొన్నారు. మరోవంక గత రెండు దశాబ్దాలుగా వెంచర్ ఫండ్స్‌కు తోడ్పాటునందిస్తున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement