♦ రికార్డుస్థాయి సమీపం నుంచి వెనుతిరిగిన సూచీలు
♦ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం
ముంబై: ఆగస్టు తొలివారంలో సృష్టించిన రికార్డు గరిష్టస్థాయికి బుధవారం చేరువగా వెళ్లిన సూచీలు..అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి వెనక్కు తగ్గాయి. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్లు, జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి 1.2 శాతం పెరిగినట్లు క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చిన నిరుత్సాహకర డేటాను లెక్కచేయకుండా...ట్రేడింగ్ తొలిదశలో ర్యాలీ జరిగింది. అయితే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావడంతో ట్రేడింగ్ ముగింపులో మార్కెట్ చాలావరకూ లాభాల్ని కోల్పోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పలాభంతోనూ, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పనష్టంతోనూ ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 10.131 పాయింట్ల గరిష్టస్థాయికి వరకూ పెరిగిన తర్వాత..10,100 పాయింట్లస్థాయిని కోల్పోయి 10,063 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 14 పాయింట్ల నష్టంతో 10,079 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ ఆగస్టు 2న 10,138 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 32,348 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 32,127 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు 28 పాయింట్ల లాభంతో 32,186 పాయింట్ల వద్ద ముగిసింది. గత నెలలో సెన్సెక్స్ సృష్టించిన కొత్త రికార్డుస్థాయి 32,686 పాయింట్లు. కొత్త రికార్డుస్థాయి సమీపానికి చేరగానే మార్కెట్ ఒడుదుడుకులకు లోనయ్యిందని, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
పెట్రో కంపెనీలు డౌన్...:ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల భారాన్ని ఇకనుంచి వినియోగదారులకు మళ్లించకుండా, కంపెనీలే భరించాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు కొన్ని ఫైనాన్షియల్ చానళ్లలో వార్తలు వెలువడటంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. షేర్లు 4–6 శాతం మధ్య పతనమయ్యాయి.
మాట్రిమోనీ ఐపీఓకు 4.4 రెట్లు సబ్స్క్రిప్షన్
ఆన్లైన్ వివాహవేదికను నిర్వహిస్తున్న మాట్రిమోనీ డాట్ కామ్ జారీచేసిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 4.41 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ముగింపురోజైన బుధవారం రాత్రి 7.15 సమయానికి ఎన్ఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం 1.24 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ. 983–985 ప్రైస్బ్యాండ్తో 28 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 17.99 రెట్లు బిడ్స్ వచ్చాయి.
సెన్సెక్స్ ప్లస్.. నిఫ్టీ మైనస్
Published Thu, Sep 14 2017 12:23 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
డల్లాస్లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR
వాట్సప్లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్ వీడియో వైరల్
కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు సెటైర్లు
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement