ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి పదవీకాలం ఏడాది పొడిగింపు! | SBI chief Arundhati extension of the term of the year! | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి పదవీకాలం ఏడాది పొడిగింపు!

Oct 2 2016 3:04 AM | Updated on Sep 4 2017 3:48 PM

ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి పదవీకాలం ఏడాది పొడిగింపు!

ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి పదవీకాలం ఏడాది పొడిగింపు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి ఆమె మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగిసింది.  భారతీయ మహిళా బ్యాంక్‌సహా 5 ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం 2017 మార్చితో ముగియాలన్న లక్ష్యం నేపథ్యంలో పదవీకాలం పొడిగింపు ఊహాగానాలు కొనసాగాయి.

మాతృసంస్థలో విలీనం అవుతున్న  ఐదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఉన్నాయి.  మరో రెండు అనుంబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాల విలీనానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement