రూ.2.23 లక్షల కోట్లకు పి-నోట్ల పెట్టుబడులు | P-Notes investment climbs to Rs 2.23 lakh crore | Sakshi
Sakshi News home page

రూ.2.23 లక్షల కోట్లకు పి-నోట్ల పెట్టుబడులు

Apr 26 2016 1:27 AM | Updated on Sep 3 2017 10:43 PM

భారత క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్(పి-నోట్స్) ఇన్వెస్ట్‌మెంట్స్ మార్చినాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి.

 న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్(పి-నోట్స్) ఇన్వెస్ట్‌మెంట్స్ మార్చినాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరిలో ఈ పి-నోట్ల పెట్టుబడులు 18 నెలల కనిష్టానికి పడిపోయాయి. కాగా పి-నోట్ల పెట్టుబడులు పెరగడం 4 నెలల్లో ఇదే తొలిసారి. నవంబర్ నుంచి పి-నోట్ల పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నా యి. విదేశీ హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పి. నోట్ల ద్వారా మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల సమయాన్ని, వ్యయాలను ఈ పి-నోట్ల పెట్టుబడులు ఆదా చేస్తాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది  ఫిబ్రవరిలో రూ.2,17,740 కోట్లుగా ఉన్న భారత క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్) పి నోట్ల పెట్టుబడులు గత నెలలో రూ.2,23,077 కోట్లకు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement