తయారీ రంగం ఊపందుకుంది: నికాయ్
తయారీ రంగం క్రియాశీలత జనవరి, ఫిబ్రవరిలో పెరిగిందని నికాయ్ ఇండియా పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండిసీస్
న్యూఢిల్లీ: తయారీ రంగం క్రియాశీలత జనవరి, ఫిబ్రవరిలో పెరిగిందని నికాయ్ ఇండియా పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండిసీస్ (పీఎంఐ) సూచీ పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సూచీ 51.1 వద్ద ఉన్నట్లు తెలిపింది. పలు రంగాల్లో వ్యాపార పరిస్థితులు మెరుగుపడినట్లు నికాయ్ తెలిపింది. సూచీ 50 పాయింట్లు పైనుంటే దానిని విస్తరణగా పరిగణిస్తారు. 50 పాయింట్ల దిగువన ఉంటే.. క్షీణతగా భావిస్తారు.


