రెడ్‌మి ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు త్వరలో | New Redmi TV X series launching soon | Sakshi
Sakshi News home page

రెడ్‌మి ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు త్వరలో

May 19 2020 6:10 PM | Updated on May 19 2020 6:14 PM

New Redmi TV X series launching soon - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ:   చైనా  స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి రెడ్‌మి బ్రాండ్ కింద కొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేయనుంది.   ప్రస్తుతం సంకక్షోభ సమయంలో మూడు స్మార్ట్ టీవీలను చై నాలో జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో  తీసుకురానుంది. రెడ్‌మి టీవీ ఎక్స్50, రెడ్‌మి ఎక్స్ 55, రెడ్‌మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను  కంపెనీ  మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. దీంతోపాటు   రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం.


 విడుదల చేస్తోంది. బెజెల్‌  లెస్‌ డిజైన్‌ తో చిన్ని సైజులో సరసరమైన అందుబాటులో తీసుకురానుందని సమాచారం.  ఈ టీవీల సైజ్ గురించి తప్ప వీటికి సంబంధించిన మరే సమాచారం అందుబాటులో లేదు.  ఈ టీవీలు డిజైన్, పిక్చర్ క్వాలిటీ ,  సౌండ్ క్వాలిటీలో మెరుగ్గా వుంటాయనిమాత్రమే రెడ్‌మి చెప్పింది. అలాగే  ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో వీటిని లాంచ్‌ చేసే అవకాశం వుందని భావిస్తున్నారు. (అద్భుతమైన ఫీచర్లతో ఫోకో ఎఫ్‌ 2 ప్రొ లాంచ్‌)

Advertisement
 
Advertisement
Advertisement