న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు అందిరికీ ఆధార్ ఈ–కేవైసీ ధ్రువీకరణ తప్పనిసరి కానుంది. కంపెనీలు ఈ–కేవైసీ విధానంలో వేలి ముద్రల ఆధారంగా ఆధార్ వివరాలు తీసుకుని కొత్త సిమ్లను యాక్టివేట్ చేస్తున్నాయి. ఇది ప్రస్తుత మొబైల్ కస్టమర్లకు కూడా అమలు కానుంది. అన్ని లైసెన్స్డ్ కంపెనీలు ప్రస్తుత మొబైల్ చందదాదారుల నుంచి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంలో ధ్రువీకరణ తీసుకోవాలంటూ టెలికం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
చందాదారుల వివరాలను తిరిగి ధ్రువీకరించే విషయమై సుంప్రీకోర్టు ఆదేశాల గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్లు ద్వారా తెలియజేయాలని, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటనలు ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించిన వివరాలను తమ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 100 కోట్ల మంది మొబైల్ కస్టమర్లకు ఈకేవైసీ ధ్రువీకరణ అమలు చేసే విషయమై చర్చించేందుకు తాము ఈ వారంలోనే సమావేశం అవనున్నట్టు సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) తెలిపింది.
దీనికి తాము మద్దతుగా నిలబడతామని, అయితే ఈ ప్రక్రియకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ఈ–కేవైసీ కంటే ముందు ప్రస్తుత యూజర్లకు కంపెనీలు వెరిఫికేషన్ కోడ్ను పంపిస్తాయి. ఈ సిమ్ వినియోగదారుడి వద్ద అందుబాటులో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకుంటాయి. ఆ తర్వాత ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను చేపడతాయి.
ప్రస్తుత మొబైల్ కస్టమర్లకూ ఆధార్ ధ్రువీకరణ
Published Mon, Mar 27 2017 12:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
Advertisement