సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ | Jaitley puts a hold on new IT norm asking foreign trips disclosure | Sakshi
Sakshi News home page

సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ

Apr 19 2015 2:35 AM | Updated on Oct 2 2018 4:19 PM

సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ - Sakshi

సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ

భారత్‌కు ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడే సత్తా పెరిగిందని...

వాషింగ్టన్: భారత్‌కు ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడే సత్తా పెరిగిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జైట్లీ, ఈ పర్యటనలో భాగంగా పీటర్‌సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విస్తృతమైన మార్కెట్ పరిమాణం, డిమాండ్, కరెన్సీ స్థిరత్వం ప్రస్తుతం భారత్‌కు కలసి వస్తున్న అంశాలని అన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఇబ్బంది ఏదీ ఉండబోదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement