మార్కెట్ల స్పందనపై వేచి చూద్దాం... | Have to wait & see how will markets react. So far,markets have done a matured analysis of situation: Shaktikanta Das | Sakshi
Sakshi News home page

మార్కెట్ల స్పందనపై వేచి చూద్దాం...

May 11 2016 1:36 PM | Updated on Sep 3 2017 11:53 PM

మారిషస్ పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మార్కెట్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు.

న్యూఢిల్లీ : మారిషస్ పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మార్కెట్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఒప్పందంపై దాదాపు మార్కెట్ విశ్లేషకులందరూ స్పందించారని, పెట్టుబడులు తగ్గే సూచనలున్నాయని వ్యక్తం చేశారన్నారు.  కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని ఆర్థికవ్యవస్థలో కల్లా భారత్ వృద్ధి రేటు క్రమేపీ పెరుగుతుందని, ఈ పెరుగుదల పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు.

భారత్ లో నేడు అమల్లో ఉన్న పన్నుల విధానం ఊహించదగినదేనని, ఈ విధానంలో పలు సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటును, ద్రవ్యోల్భణాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటూ... వాటి పెరుగుదలను నిరోధిస్తుందని దాస్ చెప్పారు. మొత్తాన్నికి భారత్  పెట్టుబడులు పెట్టడానికి ఒక ఆకర్షణీయమైన దేశంగా దాస్ అభివర్ణించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement