రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా? | Creditors are OK for GMR Group plan | Sakshi
Sakshi News home page

రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?

May 4 2019 12:46 AM | Updated on May 4 2019 12:46 AM

Creditors are OK for GMR Group plan - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌ (జీఆర్‌ఈఎల్‌), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీకి రూ.2,353 కోట్ల రుణ భారం ఉంది. తొలుత దీన్లో రూ.1,412 కోట్లను చెల్లించేందుకు ఒక విధానాన్ని రూపొందించారు. రూ. 1,412కోట్లలో 20% చెల్లించేందుకు, ఇంకా తొలి ఏడాది వడ్డీల కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.395 కోట్లు కేటాయిస్తుంది. మిగిలిన రూ. 1,130 కోట్ల రుణాన్ని 9% ఫ్లోటింగ్‌ వడ్డీతో వచ్చే 20 ఏళ్లలో చెల్లించనుంది. మొత్తం రూ. 2353 కోట్లలో రూ. 1,412 కోట్లు పోగా మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని  భవిష్యత్‌లో చెల్లుబడయ్యే సీఆర్‌పీఎస్‌గా (క్యుములేటివ్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు) మార్చింది. ఈ షేర్లకు ఇప్పటినుంచి 17–20 ఏళ్ల మధ్య 0.1% వడ్డీతో చెల్లింపులు చేస్తారు.

ఈ ప్రణాళిక కంపెనీకి, రుణదాతలకు మేలు చేస్తుందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఎండీ గ్రంధి కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. తమ గ్రూప్‌ మొత్తం రుణాలు తగ్గేందుకు ఈ ప్రణాళిక ఉపకరిస్తుందన్నారు. రాజమండ్రి ప్లాంట్‌ పనిచేసేందుకు తగిన గ్యాస్‌ లభిస్తుందనే నమ్మకాన్ని జీఎంఆర్‌ వ్యక్తంచేస్తోంది. తద్వారా జీఆర్‌ఈఎల్‌ నిర్వహణ కొనసాగి సీఆర్‌పీఎస్‌లు డిఫాల్ట్‌ కాకుండా ఉంటాయని భావిస్తోంది. 2016లో జీఆర్‌ఈఎల్‌ వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణకు(ఎస్‌డీఆర్‌) వెళ్లింది. 2012లో ఈ ప్లాంట్‌ పూర్తయింది. కానీ గ్యాస్‌ సరఫరాలో కొరత కారణంగా కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. దీంతో వ్యయాలు పెరిగి రుణభారం ఎక్కువైంది. 2015లో సంస్థ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement