ఎయిర్‌టెల్‌ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్‌

Airtel and Lava may launch 4G smartphone at price of Rs 1,699

జియోకు కౌంటర్‌గా కార్బన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్‌ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే కొన్ని స్పెషిఫికేషన్లు, ధరలో మాత్రమే తేడా ఉండనుందట. కార్బన్‌ ఏ40 ఇండియన్‌ మాదిరిగా భారీ మొత్తంలో డేటా, వాయిస్‌ ప్రయోజనాలతోనే ఈ ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌ వస్తుందని తెలుస్తోంది. దీని ధర రూ.1,699గా ఉండబోతుందని వెల్లడవుతోంది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 1,399 రూపాయలు.

లావా ఫోన్‌ వ్యూహం కూడా కార్బన్‌ ఏ40 ఇండియన్‌ మాదిరిదేనట. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి తొలుత వినియోగదారులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కంపెనీ రూ.1,801ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. అంటే ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌ అందుబాటులోకి వచ్చేది 1,699 రూపాయలకే. అయితే రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్‌ చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. 4.5 అంగుళాల లేదా 5 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్‌ కలిగి ఉండబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఇటు ఎయిర్‌టెల్‌ కానీ, అటు లావా కానీ ఈ డివైజ్‌పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top