రాష్ట్ర ప్రజలకు అండగా వైస్ఆర్సిపి: జూపూడి | YSRCP support to people : Jupudi Prabhakara Rao | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు అండగా వైస్ఆర్సిపి: జూపూడి

Aug 8 2013 8:09 PM | Updated on May 29 2018 2:59 PM

రాష్ట్ర ప్రజలందరికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు.

ఢిల్లీ: రాష్ట్ర ప్రజలందరికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్‌లోనే స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరికి సమన్యాయం చేయాలని తమ పార్టీ నిర్ణయం అని చెప్పారు.

కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్‌ను ఆదరించిన జనాన్ని విభజించి శిక్షించారని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement