‘తండ్రీ కొడుకులను వ్యాన్‌లో మా రాష్ట్రానికి పంపండి’ | Ysrcp MP Vijaysai reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

‘తండ్రీ కొడుకులను వ్యాన్‌లో మా రాష్ట్రానికి పంపండి’

May 9 2020 9:49 AM | Updated on May 9 2020 9:56 AM

Ysrcp MP Vijaysai reddy fires on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : హైదరాబాద్‌లో ఉంటూనే ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. విమానంలోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. (ఐఏఎస్‌లకు ఏం తెలుసు?)

Advertisement
 
Advertisement
Advertisement