లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం: వైఎస్‌ జగన్‌ | ys jagan mohanreddy visits differently abled aashram at Raptadu | Sakshi
Sakshi News home page

లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం: వైఎస్‌ జగన్‌

Dec 12 2017 6:36 PM | Updated on Jul 25 2018 4:07 PM

 ys jagan mohanreddy visits differently abled aashram at Raptadu - Sakshi

సాక్షి, రాప్తాడు : లక్ష్మీ నారాయణ సేవలు ప్రశంసనీయం అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. 33వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన రాప్తాడులోని దివ్యాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లక్ష్మీ నారాయణను అభినందించారు.

దివ్యాంగులకు భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ వారికి స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఆయన పడుతున్న శ్రమను అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం అక్కడి దివ్యాంగులతో వైఎస్‌ జగన్‌ కాసేపు ముచ్చటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement